భారతీ సిమెంట్స్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారతీ సిమెంట్స్కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్డీ మొత్తాన్ని విడుదల చేయాలని ఈడీని ఆదేశిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎఫ్డీల స్థానంలో బ్యాంకు గ్యారంటీలు తీసుకొని ఎఫ్డీలను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ధర్మాసనం ఈడీ వాదనలతో ఏకీభవించింది.