నంద్యాలలో దారుణ హత్య

514చూసినవారు
నంద్యాలలో దారుణ హత్య
నంద్యాలలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దేవనగర్‌కు చెందిన షేక్ షమీర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపారు. షమీర్.. నంద్యాలలోని దర్గా సెంటర్‌లో చికెన్ పకోడా వ్యాపారం చేస్తుంటాడు. వేసవి కావడంతో ఉక్కపోత భరించలేక రాత్రి ఇంటి పైకప్పుపై షమీర్ నింద్రించాడు. అర్థరాత్రి ఆగంతకులు షమీర్ గొంతుకోసి హత్య చేశారు. సోమవారం తెల్లవారుజామున షమీర్ మృతదేహాన్ని చూసి కుటుంబీకులు షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.