ఏలూరు జిల్లా నూజివీడులో దారుణం జరిగింది. శాంతినగర్కు చెందిన యశ్వంత్ రెడ్డి (16) హత్యకు గురయ్యాడు. తూ.గో. జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి రామిరెడ్డి చిన్న కొడుకు యశ్వంత్ రెడ్డి. 25 ఏళ్ల క్రితం వ్యాపారాల నిమిత్తం నూజివీడుకి వచ్చారు. అయితే ఏం జరిగిందో తెలియదు. శుక్రవారం యశ్వంత్ రెడ్డి బిల్డింగ్ పైనుంచి కింద పడి ఉండటం గమనించారు. అతని తలపై రోలుతో దాడి చేసి.. టెర్రస్ పైనుంచి పడేసినట్లు సమాచారం.