హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

62చూసినవారు
దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు ఇంటి బాట పట్టారు. పండుగకు సొంత ఊళ్లకు ప్రజలు ప్రయాణమవడంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పతంగి టోల్ ప్లాజా వద్ద కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి.

సంబంధిత పోస్ట్