ల్యాండ్ టైటిలింగ్ చట్టం చూస్తే చాలు గత ప్రభుత్వ పాలన ఏంటో తెలుస్తుందని మంత్రి పార్థసారథి అన్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కేంద్రం చెప్పిన దానికి రాష్ట్రం అమలు చేసిన దానికీ అసలు పొంతన లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఏ ఒక్కటీ ఈ చట్టాన్ని అమలు చేయలేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని, రైతులందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తామన్నారు.