ఏపీలో పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. పెన్షన్ల పంపిణీపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఈసీ నేరుగా వివరాలను సేకరిస్తోంది. జిల్లాల వారీగా సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అబ్జర్వర్లు పంపిస్తున్నారు. దీంతో పలు జిల్లాలలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం వివరాలు తీసుకుంటుంది. పెన్షన్లపై నెలకొన్న వివాదం, ఫిర్యాదుల నేపథ్యంలో సీఈసీ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.