మోసాల పై సైబర్ క్రైమ్ అలర్ట్ ప్రకటన

54చూసినవారు
మోసాల పై సైబర్ క్రైమ్ అలర్ట్ ప్రకటన
తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ బ్యూరో వారు ప్రజలకు సైబర్ మోసాల పై అలర్ట్ ప్రకటించారు. మీ మొబైల్స్ కు ఆన్ లైన్ షాపింగ్స్ పై ఆఫర్లు ఉన్నాయని, మీ బ్యాంకుకు సంబంధించిన వివరాలు అడిగి ఏటిఎం ఓటీపీ చెప్పమని కోరినా చెప్పవద్దని తెలిపారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని, లింక్ ల పై క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ వారు హెచ్చరించారు. లింక్ లపై క్లిక్ చేస్తే మీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతాయన్నారు. ఈ మోసాల పై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ 1930, వాట్సాప్ నంబర్ 8712665555, cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్