AP: రాష్ట్రాన్ని రావణకాష్టంగా చంద్రబాబు మారుస్తున్నారని వైసీపీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. "పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. ప్రణాళిక బద్ధంగానే వైసీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు. ఓడిపోతాడు అనే భయంతో చంద్రబాబు దాడులు చేయిస్తున్నాడు. ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడు. టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది." అని మంత్రి ఎద్దేవా చేశారు.