డయాలసిస్ యంత్రాలలోకి స్వచ్ఛమైన జలం పంపుతూ డాక్టర్లు రోగులకు డయాలసిస్ ప్రక్రియ నిర్వహిస్తుంటారు. ప్రతి రోగికి డయాలసిస్ చేసే సమయంలో 7 లీటర్ల నీరు అందించాలి. విద్యుత్ సరఫరా సక్రమంగా లేని కారణంగా డయాలసిస్ కేంద్రంలో ఉన్న ఆర్ఓ ప్లాంటు పని చేయకపోవడంతో ఫ్లోరైడ్ నీటినే డయాలసిస్ యంత్రాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడే యంత్రాలు నిలిచిపోయాయి. కేవలం నాలుగు యంత్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి.