తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్ పార్క్’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ప్రస్తుతం భారత్లో నెల్లూరు జిల్లా శ్రీహరికోట వద్ద బంగాళాఖాతం తీరంలో మాత్రమే రాకెట్ ప్రయోగ కేంద్రం అందుబాటులో ఉంది.