నవరత్నాల పేరుతో సీఎం జగన్ నవ మోసాలు చేశారని చంద్రబాబు విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్నారని మండిపడ్డారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి.. మాట తప్పారని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి.. పేదలకు పంచుతామని చెప్పారు.