AP: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతల విభాగం నుంచి శంకబ్రత బాగ్చీని విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా నియమించి..ఆక్టోపస్ ఐజీ శ్రీకాంత్కు శాంతిభద్రతల బాధ్యతలను డీజీపీ తిరుమలరావు అప్పగించారు. టెక్నికల్ సర్వీసెస్ ఐజీ హరికృష్ణకు హోంగార్డ్స్, సిబ్బంది బాధ్యతలు అప్పగించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉన్న రాజశేఖర్ బాబుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు.