శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రూ.4,400 కోట్లు విడుదల..!

65చూసినవారు
శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రూ.4,400 కోట్లు విడుదల..!
ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ దారులకు శుభవార్త చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిమిత్తం రూ.4,400 కోట్ల నిధులను శనివారం విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యకార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ ఇచ్చారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు చెప్పారు. జూలై 1వ తేదీన 65.18 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్