ఆశా వర్కర్ అనుమానస్పద మృతి

50చూసినవారు
ఆశా వర్కర్ అనుమానస్పద మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం పుదిపట్ల సచివాలయంలో ఆశా వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న సరోజమ్మ (27) గురువారం చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందింది. మృతురాలి తల్లి తెలిపిన వివరాల మేరకు భర్త లక్ష్మీపతి కొన్ని రోజుల నుంచి తన బిడ్డను వేధింపులకు గురిచేస్తున్నాడని ఈ క్రమంలోనే తన బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్