చంద్రగిరి మండలం - Chandragiri Mandal

చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు షాక్...

చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు షాక్...

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది. చంద్రబాబు తొలిసారిగా పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నియోజకవర్గంలోని 95 ఎంపిటిసిల్లో 76 స్ధానాల్లో ఏకగ్రీవమవ్వడంతో టీడీపీ నేతలు షాక్ లో ఉన్నారు.76 స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుపొందడంతో ఆ పార్టీ జోష్ లో ఉంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ ఇంచార్జ్ పులివర్తి నాని మాత్రం తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వైసీపీ దౌర్జన్యంతో 76 స్థానాలను ఏకగ్రీవంగా గెలుపొందిందని ఆరోపించారు. అరాచకం సృష్టించిందని..టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో సైతం వైసీపీ కీలక స్థానాల్లో విజయం సాధించడాన్ని టీడీపీ శిబిరంలో ఆవేదన నెలకొంది. అయితే వైసీపీ దౌర్జన్యంతోనే గెలుపొందిందని టీడీపీ ఆరోపిస్తోంది.

జగిత్యాల జిల్లా