బైక్ ను ఢీకొన్న పాల వాహనం.. ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ని పాల వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న గంగవరం పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పలమనేరుకు చెందిన రాజేశ్, నారాయణ గా గుర్తించారు.