May 08, 2024, 16:05 IST/కరీంనగర్
కరీంనగర్
400 చీరలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
May 08, 2024, 16:05 IST
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్టు చౌరస్తా వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో ఈకో వాన్ లో సరైన రసీదులు లేని అక్రమంగా తరలిస్తున్న దాదాపు 3 లక్షల విలువ చేసే 400 చీరలతో పాటు ఇతర దుస్తులను పట్టుకుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన చీరలను తదుపరి ప్రక్రియకు సంబంధిత అధికారుల వద్దకు తరలించామని కరీంనగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.