May 06, 2024, 17:05 IST/మంథని
మంథని
వంశీ కృష్ణను గెలిపించుకుందాం: మంత్రి శ్రీధర్ బాబు
May 06, 2024, 17:05 IST
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకుందామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు. సోమవారం రాత్రి సుల్తానాబాద్ పూసాల రోడ్డు వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావుతో కలిసి మాట్లాడారు. ఈసమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, అసెంబ్లీ ఇంచార్జీ రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.