రెండు వాహనాలు ఢీ.. పలువురికి గాయాలు

26464చూసినవారు
కుప్పం మండలం వానగుట్టపల్లి సమీపంలోని మలుపు వద్ద గురువారం ద్విచక్ర వాహనం ఆటో ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో కాస్త అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :