

బంగారుపాళ్యం: ముమ్మరంగా తాసిల్దార్ కార్యాలయ సుందరీకరణ
బంగారుపాళ్యం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయ ఆవరణ సుందరీకరణ పనులు తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీఆర్వో హేమచంద్ర సారద్యంలో ఆదివారం కూడా సుందరీకరణ పనులు కొనసాగాయి. కార్యాలయం ఆవరణలో పార్కింగ్, గ్రీనరీ, చెట్లను పెంచడం వంటి పనులు చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కార్యాలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు.