టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని పూజలు
పూతలపట్టు మండలం పేటమెట్టలో వెలసిన కోదండ రామాలయంలో చిత్తూరు టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళీమోహన్ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు గల్లా రాధాకృష్ణ, సంపత్ నాయుడు, భానుమూర్తి నాయుడు, రామానాయుడు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసారు.