ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈసీ ఆదేశాలతో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. విచారణలో భాగంగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. రేపు విచారణకు రావాలని ఆదేశించారు. అలాగే ఈ ఫిర్యాదుపై మరింత సమాచారం ఇవ్వాలంటూ వైసీపీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందజేశారు.