రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

72చూసినవారు
రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మినీ లారీ బోల్తా పడి ఏడుగురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా, తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం అర్థరాత్రి జీడిపిక్కల లోడుతో వెళ్తున్న మినీ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్