సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రవర్తనా నియమావళిని పాటించాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవడం తప్పదని కలెక్టర్ కే. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయినందున ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు.