ఓటు వేయండి - బహుమతి గెలవండి: కలెక్టర్
ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకుని సామాజిక మాధ్యమాల్లో ఫొటో గాని, వీడియో గాని అప్లోడ్ చేయడం ద్వారా మరింత మందికి స్ఫూర్తినివ్వాలని తూ. గో జిల్లా కలెక్టర్ మాధవీలత పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ అంబాసిడర్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. యువత ఇందులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.