అగ్ని బాధిత కుటుంబానికి ఎన్డీఏ తక్షణ సాయం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు నాగులపేటలో శుక్రవారం ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన గొంపా మాలిబాబు కుటుంబ సభ్యులను టిడిపి, జనసేన, బిజెపి ఎన్డీఏ నాయకులు ఓదార్చి తక్షణసాయంగా 50 కిలోల బియ్యం, వెయ్యి రూపాయలు నగదు అందజేశారు. అలాగే ప్రభుత్వము నుండి అందవలసిన సాయానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని వారు తెలిపారు.