పేదలకు అండగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకమని ఉంగుటూరు గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు అన్నారు. మంగళవారం ఉంగుటూరు గ్రామ పంచాయతీ కమిటీ హాల్లో ఉపాధి హామీ గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి కాకర్ల వెంకట గిరిధర్, గ్రామ ఉపసర్పంచ్ పాతూరి జగదీష్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.