అసెంబ్లీ సమావేశంలో నవ్వుల పువ్వులు....

68చూసినవారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో నవ్వుల పువ్వులు కాసాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80% మంది ఎమ్మెల్యేలు నిల్చున్నారు. రాజకీయ పోరాటం చేసిన అందరిపైనా గత ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. ఇంకా ఎప్పటికీ బయటకు రాకూడదనుకున్నారు. ప్రజలు ఆలోచించి అందరినీ అసెంబ్లీకి పంపారని అన్నారు. జగన్ పాలనలో అందరూ బాధితులేనని చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్