విజయవాడలో నలుగురు పిల్లలు మిస్సింగ్

81చూసినవారు
విజయవాడలో నలుగురు పిల్లలు మిస్సింగ్
విజయవాడలో నిన్న నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. భవానీపురానికి చెందిన పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దాంతో కుటుంబ సభ్యులు చుట్టూ గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు డీసీపీల ఆధ్వర్యంలో 15 టీములుగా విడిపోయి చిన్నారుల కోసం గాలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చివరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పిల్లలను గుర్తించారు. ఇవాళ తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించనున్నారు.

సంబంధిత పోస్ట్