గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

84చూసినవారు
భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరద పోటెత్తడంతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 14.10 అడుగులకు చేరింది. సముద్రంలోకి 13.23లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి వరదతో కోనసీమ పరిధిలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పి.గన్నవరం, అయినవిల్లి మండలాలకు చెందిన లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.
Job Suitcase

Jobs near you