గుడ్ న్యూస్.. ఆలయాలకు అందించే సాయం పెంపు

75చూసినవారు
గుడ్ న్యూస్.. ఆలయాలకు అందించే సాయం పెంపు
చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేధ్యాలకు ప్రతి నెలా అందించే సాయాన్ని ఏపీ ప్రభుత్వం రూ.5 వేలు నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అర్చకుడి భృతిగా రూ.7 వేలు, పూజలకు రూ.3 వేలు వినియోగించనున్నారు. ఈ నగదు మొత్తాన్ని ఆలయ అర్చకుడి బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తారు. దీని వల్ల రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరగా.. ప్రభుత్వంపై ఏటా రూ.32.40 కోట్ల భారం పడుతుంది.

సంబంధిత పోస్ట్