మహోన్నత వైద్యుడు డాక్టర్‌ మద్దినేని గోపాలకృష్ణ

1305చూసినవారు
మహోన్నత వైద్యుడు డాక్టర్‌ మద్దినేని గోపాలకృష్ణ
గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై స్వధర్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్‌ మద్దినేని గోపాలకృష్ణను ధర్మజ్యోతి పురస్కారం తో సత్కరించారు. స్వధర్మ సేవా సంస్థ కోశాధికారి లంకా సూర్యనారా యణ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథి గా పాల్గొన్న డాక్టర్‌ బసవపున్నయ్య మాట్లాడుతూ డాక్టర్‌ మద్దినేని గోపాలకృష్ణ ఎందరో పేదలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేసిన మహోన్నత వైద్యుడు అని కొనియాడారు. వైద్య రంగంలోనే కాక, విద్యారంగంలో కూడా ఆయన ఎన్నో సేవలు చేశారన్నారు. నాగార్జున ఎడ్యుకేషన్‌ సొసైటీ కి కార్యదర్శిగా 30 సంవత్సరాలు విశేష సేవ లించారన్నారు. పలు విద్యా, సేవా సంస్థలకు భూరి విరాళాలను గుప్తం గా అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్‌ గోపాలకృష్ణ అన్నా రు. ఈ సందర్భంగా నగరంలోని పలువురు వైద్యులు సేవా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల పుర ప్రముఖులు డాక్టర్‌ మద్దినేని గోపాల కృష్ణను ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :