Feb 11, 2025, 16:02 IST/
19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం
Feb 11, 2025, 16:02 IST
మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల అమ్మాయిపై ఆమె బంధువులే దారుణంగా ప్రవర్తించారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను 15 అడుగులు ఎత్తైన టెర్రస్ నుంచి కిందకు తోసేశారు. ప్రస్తుతం ఆమె జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి నిందితుల కోసం గాలిస్తున్నారు.