ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-విశాఖపట్నం (IIM-V) శాశ్వత క్యాంపస్ ప్రారంభానికి సిద్ధమైంది. ఆనందపురం మండలం గంభీరంలో 436 ఎకరాల్లో విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ క్యాంపస్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్తో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు వర్చువల్గానే పాల్గొననున్నారు. ఈ క్యాంపస్ నిర్మాణానికి రూ.472.61 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.