విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలస బహిరంగ సభ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. సభలో విపక్షాలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. "ఇటు పక్క పాండవ సైన్యం ఉంది. అటు పక్క కౌరవ సైన్యం ఉంది. అక్కడ పద్మవ్యూహం పొంచి ఉంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ అభిమన్యుడు కాదు ఉన్నది. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారు." అని జగన్ వ్యాఖ్యానించారు.