‘గుడ్ బుక్’ పేరుతో జగన్ మోసం: వాసిరెడ్డి పద్మ (వీడియో)

52చూసినవారు
మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ బుధవారం వైసీపీకి రాజీనామా చేసి జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అధికారం ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారు. ప్రజలను లూటీ చేశారు. అందుకే ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు కార్యకర్తలకు ప్రమోషన్స్ అంటూ జగన్ గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. నాయకులు, కార్యకర్తలకు ఉండాల్సింది గుడ్ బుక్ కాదు. గుండె బుక్.’ అని వాసిరెడ్డి పద్మ అన్నారు.