అర్ధరాత్రి నడి రోడ్డులో మొసలి కలకలం

66చూసినవారు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బైపాస్ పిల్లుట్ల జంక్షన్ సమీపంలో రోడ్డుపై ఓ భారీ మొసలి ప్రత్యక్షమైంది. రోడ్డు దాటే ప్రయత్నంలో అటుఇటు తిరగడంతో ఆ మార్గంలో వెళ్తున్న భారీ లారీలు, ఇతర వాహనదారులు హెడ్ లైట్ల కాంతుల్లో మొసలిని చూసి అవాక్కై సడన్ బ్రేక్‌లు వేసుకోవాల్సివచ్చింది. పొలాల్లో నుంచి రోడ్డుపైకి వచ్చిన మొసలిని చూసి వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తరుచు ఈ మార్గంలో మొసళ్ళ సంచారం ఉంటోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్