ఆ హత్యకు జగనే కారకుడు: మంత్రి డోలా

54చూసినవారు
ఆ హత్యకు జగనే కారకుడు: మంత్రి డోలా
పల్నాడు జిల్లా వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదించడం సిగ్గుచేటని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. ఈ హత్యకు ముఖ్య కారకుడు జగనేనని, వైసీపీ హయాంలో మృతుడు రషీద్, నిందితుడు జిలానికి మధ్య గొడవలు జరిగాయన్నారు. అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఈ హత్య జరిగేదా? అని ప్రశ్నించారు. నాడు జగన్ చేసిన పాపానికి నేడు నిండు ప్రాణం బలైందన్నారు.
Job Suitcase

Jobs near you