బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన హింస.. 50 మందికి గాయాలు

53చూసినవారు
బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఢాకాలో ఆదివారం విద్యార్థులకు, పారామిలిటరీ దళమైన అన్సార్‌ సభ్యులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది కాస్తా హింసాత్మకంగా మారి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో దాదాపు 50 మందికిపైగా గాయపడినట్లు నివేదించింది. అలాగే పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దింపినట్లు వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్