జగన్ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ నిలువునా ముంచారని మండిపడ్డారు. ఐదేళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా, ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు యువత అగ్రస్థానంలో ఉండాలనేదే తన కోరిక అని అన్నారు. ఏపీలో గ్రూప్-1 పోస్టులను ఇష్టారీతిన కావాల్సిన వారికి ఇచ్చారని ఆరోపించారు.