AP: ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. 81 లక్షల ఎకరాల్లో 24 రకాల పంటల సాగు లక్ష్యంగా ఉండగా.. 167.15 లక్షల టన్నుల పంట ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. ఇప్పటికే 5.49 లక్షల క్వింటాళ్ల వరి, చిరుధాన్యాలు, అపరాలు, నువ్వులు, వేరుశనగ విత్తనాలను రాయితీతో ఆర్బీకేల ద్వారా పంపిణీకి రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది.