పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వెంకట్రావు

71చూసినవారు
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వెంకట్రావు
రాష్ట్ర అభివృద్ధితోపాటు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నిత్యాసర సరుకుల ధరలను నియంత్రిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కందిపప్పు, బియ్యం అందించేందుకు ప్రత్యేక కౌంటర్ ను గురువారం ఉదయం గన్నవరం రైతు బజార్లో ఆయన ప్రారంభించి ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.