
గన్నవరం: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జిల్లా కోర్టు వంశీ రిమాండ్ను పొడిగించింది. ఆత్కూరులో 9 ఎకరాలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసులో న్యాయస్థానం వంశీకి రిమాండ్ను పొడిగించింది. మరోవైపు గన్నవరంలో సీతామహాలక్ష్మి అనే మహిళ స్థలం కబ్జా చేశారన్న కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.