నూజివీడు ఎమ్మెల్యేగా ఉమ్మడి అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావును మనందరం కలిసి గెలిపించుకుందామని గన్నవరం
జనసేన పార్టీ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి నూజివీడు
జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో గన్నవరం ఎమ్మెల్యేగా ముద్ర బోయిన సేవలను ఆయన కొనియాడారు.