చంద్రబాబు నివాసం దగ్గర ఆలూరు టిడిపి నాయకులు నిరసన

4948చూసినవారు
ఆలూరు: హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ అనుచరులు మంగళవారం నిరన వ్యక్తం చేశారు. ఆలూరుపై ఇటీవలి జాబితాలో టీడీపీ స్పష్టతనివ్వలేదు. మాజీ ఇన్ఛార్జ్లలు వీరభద్ర గౌడ్, వైకుంఠం జ్యోతితో పాటు తాజాగా పార్టీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఆశావహుల్లో ఉన్నారు. దీంతో సుజాతమ్మ అనుచరుల్లో ఆందోళన నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్