సుంకేసులకు 36,078 క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో

62చూసినవారు
కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ కు క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం జలాశయానికి 36, 078 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వాయర్ నుంచి 8 గేట్లను ఎత్తి 33, 633 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కేసీ కెనాల్ కు 2, 445 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్