
కోడుమూరు ఎస్సీ హాస్టల్ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి
కోడుమూరు ఎస్సీ హాస్టల్లో చిన్నారులపై పాశవికంగా దాడి జరిగిన ఘటనపై బాధ్యులపై వెంటనే కేసు నమోదు చేయాలని, వార్డెన్ రాముడును విధుల నుంచి తొలగించాలని కోరుతూ సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నవ్యకి వినతిపత్రం అందజేసారు PDSU రాష్ట్ర అధ్యక్షుడు కె. భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, నగర అధ్యక్షుడు దామోదర్.