మే 13న జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి హితవు పలికారు. మంగళవారం పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంళంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యకు రెండు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.