ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. శనివారం తిరువనంతపురం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బెంగళూరు బయలుదేరింది. ఆ కొద్ది సేపటికి విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించి తమిళనాడులోని తిరుచునాపల్లి ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో ఈ విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు.