హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ

69చూసినవారు
హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ
కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడకు వస్తున్న రైలులో భారీ చోరీ జరిగింది. రూ.2.5 కోట్ల విలువైన 3.5 కేజీల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన విశ్వనాథ్, రంగారావు బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు. వీరు తయారు చేసిన ఆభరణాలను కర్ణాటకలోని బళ్లారిలో అమ్మడానికి వెళ్లారు. ఎవరూ కొనకపోవడంతో తిరుగు ప్రయాణమయ్యారు. వారు నిద్రిస్తున్న సమయంలో నంద్యాల సమయంలో ఆ నగలను దొంగలు చోరీ చేశారు.

సంబంధిత పోస్ట్